Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేవాలయానికి రెండు వాటర్‌ ట్యాంకుల వితరణ.. యువర్స్‌ ఫౌండేషన్‌

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానమునకు శుక్రవారం యువర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు వైకే శ్రీనివాసులు, సభ్యులు డాక్టర్‌ బి.వి.సుబ్బారావు, చాంద్‌ బాషా, బండ్లపల్లి రంగనాథం, బండి నాగేంద్ర, గారే రమేష్‌ బాబు, షీలా నాగేంద్ర, జయంతి వినోద్‌ ఆధ్వర్యంలో వి ఆర్‌ సి గుప్తా తన భార్య కీర్తిశేషులు వంకదారి సుజాతమ్మ జ్ఞాపకార్థం వీరి కుమార్తెలు నీరజ దేవి, షర్మిల దేవి, హేలాస దేవి లు రెండు వాటర్‌ ట్యాంకులను అర్చకులు ద్వారకనాథ శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి, కృతజ్ఞతలను తెలియజేశారు. యువర్‌ ఫౌండేషన్‌ చేస్తున్న ఇటువంటి సేవలను పట్టణ ప్రజలు వద్ద మన్ననలు పొందుతున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img