Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు

ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
విశాలాంధ్ర `ఉరవకొండ : ఉరవకొండ నియోజక వర్గములోని నూతనంగా నిర్మించనున్న మూడు దేవాలయలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు తిరుమల- తిరుపతి దేవాస్థానము బోర్డుల ద్వారా ఒక్కో దేవాలయానికి పదిలక్షల రుపాయల చొప్పున ముప్పై లక్షల రుపాయలు నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్సీ వై. శివరామరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉరవకొండ మండలము వ్యాసాపురము గ్రామములోని సుంకులాంబ దేవాలయం, వజ్రకరూరు మండలములోని వెంకటాంపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం,కొనకొండ్ల గ్రామములో ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణముకొరకు నిధులు విడుదల అయ్యాయన్నారు. దేవాలయాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలోని నిర్మించాలన్నారు. ఆయా గ్రామ ప్రజలు నుంచి విజ్ఞప్తులు రావడంతో వాటిని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, మరియు తిరుమల తిరుపతి దేవాస్థానము బోర్డు చైర్మేన్‌ వై.వి. సుబ్బారెడ్డి ని సంప్రదించగా వారు స్పందించి ఆ దేవాలయల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. దేవాలయాలకు నిధులు మంజూరు చేయించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్సీ వై శివరాం రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img