విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 15వ వార్డులో బుధవారం రాత్రి దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ, వార్డుల్లో దోమలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి ముందస్తు చర్యలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. వార్డులోని ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు లేకుండా చూసుకోవాలన్నారు దోమల వల్ల డెంగ్యూ, మలేరియా టైఫాయిడ్, విష జ్వరాలు తదితర వ్యాధులు ప్రభులే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.