Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఆదివారం వచ్చిన గాలివానకు రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. వైసీపీ యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, ఆర్బీకే సిబ్బంది హర్ష, రాజు, బాషాతో కలిసి సోమవారం గోళ్లపల్లి, మరూరు, ఎం.చెర్లోపల్లి, పాలచెర్ల గ్రామాల్లో దెబ్బతిన్న అరటి, చీనీ, దానిమ్మ, పూలతోటలను పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పంట నష్టానికి సంబంధించి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ మంజూరయ్యేందుకు ఉద్యాన అధికారులతో పంటనష్ట నివేదికలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపేలా చొరవ తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img