Friday, April 19, 2024
Friday, April 19, 2024

నారా లోకేష్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కుటుంబం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గంలో గురువారం యువగలం పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు మరియు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన దగా పనికి ఒక వ్యక్తిని కోల్పోగా గురువారం ఆ కుటుంబం వారు కలిసి నారా లోకేష్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు ధన్యవాదాలు తెలిపారు వాటికి కారణాలు తెలపడానికి అన్ని సహాయ సహకారాలు అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవితమ్మ చొరవతో లోకేష్ ను కలిసి తెలుగుదేశం పార్టీకి ఎంతో రుణపడి ఉన్నామని వారి యొక్క భావాలను తెలియజేశారు ఈ యొక్క కథను వింటే తెలుగుదేశం అంటే ఏంటో తెలుస్తుంది
క‌న్న‌తండ్రిని వైఎస్ గ్యాంగ్ క‌డ‌తేర్చితే
తెలుగుదేశ‌మే గుడి..ఎన్టీఆర్ ట్ర‌స్టే బ‌డి
నారా లోకేష్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన‌ ప్ర‌యోజ‌కులైన పిల్ల‌లుక‌న్న‌తండ్రిని రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌నుషులు క‌డ‌తేర్చారు. క‌ష్ట‌కాలంలో ఆ చిన్నారుల‌ని అక్కున చేర్చుకుని తెలుగుదేశం గుడి అయ్యింది. కురుబ‌వాండ్ల‌ప‌ల్లికి చెందిన టిడిపి కార్య‌క‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ ని, 2004లో అప్పటి కాంగ్రెస్ నాయకులు దారుణంగా హత్య చేశారు. తెలుగుదేశం పార్టీ ఇంటికి పెద్ద‌లా పిల్ల‌ల బాధ్య‌త‌లు స్వీక‌రించింది. సాయి చరణ్ ఎన్టీఆర్ స్కూల్ లో ఇంటర్ వరకూ ఉచితంగా విద్య‌,వ‌స‌తి క‌ల్పించి చ‌దివించారు. బీటెక్ పూర్తి చేయ‌డానికి కూడా టిడిపి స‌హ‌కారం అందించింది. ఇప్పుడు మోహ‌న్ బెంగ‌ళూరులో జాబ్ చేస్తున్నాడు. చిన్నఅబ్బాయి మోహన్ ఎన్టీఆర్ స్కూల్‌లోనే ఇంటర్ పూర్తి చేసి, ప్ర‌స్తుతం ఎంబీఏ చ‌దువుతున్నాడు. త‌మ‌ని త‌ల్లిదండ్రుల్లా పెంచి పెద్ద‌చేసి, చ‌దివించిన తెలుగుదేశం పార్టీకి రుణ‌ప‌డి ఉంటామ‌ని చెబుతున్న ఈ అన్న‌ద‌మ్ములు, పాద‌యాత్ర‌లో నారా లోకేష్‌ని క‌లిపి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశారు నారా లోకేష్ బాబును కలిసి ముఖాముఖిగా మాట్లాడినందుకు వారితో ఫోటో తీసుకోవడానికి అవకాశం కల్పించిన సవితమ్మ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img