Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిరుద్యోగ యువతి యువకులు రూడ్ సెట్ సేవలను వినియోగించుకోండి

విశాలాంధ్ర- కదిరి : నిరుద్యోగ యువతీ యువకులు రూడ్ సెట్ సేవలు వినియోగం చేసుకోవాలని
రూడ్ సెట్ డైరెక్టర్ లోకనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వెలుగు ఏపిఎం శారద రెడ్డి అధ్వర్యములో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రం కదిరి వారి సహకారముతో రూడ్ సెట్ సంస్థ వారు రూడ్ సెట్ సంస్థలో ఇవ్వనున్న శిక్షణ కార్యకమాలపై అల్లిపూర్ తండా,కుమ్మర వాండ్ల పల్లి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యకమంలో రుడ్ సెట్ డైరెక్టరు లోకనాథ్ రెడ్డి ఔత్సాహిక అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రూడ్ సెట్ సంస్థలో మహిళలకు కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, జర్దోషి మగ్గం వర్క్, జనపనార బ్యాగుల తయారీ మరియు ఊరగాయల తయారీ, పురుషులకు సెల్ ఫోన్ రిపేరు, ఫోటో గ్రఫీ, ద్విచక్ర వాహన రేపేరిలు, మోటార్ రీపేరిల నందు శిక్షణ ఇస్తూ శిక్షణతో పాటు భోజనం మరియు వసతి ఉచితంగా కల్పించబడునని తెలియజేశారు.
శిక్షణ తరువాత శిక్షకణార్ధులకు అర్హతను బట్టి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించ నున్నట్లు తెలియ జేశారు.ఆర్బీఐ అర్థిక అక్షరాశ్యత కౌన్సిలర్ వీర మారుతి , నాగప్ప మాట్లడుతూ డబ్బులులను బ్యాంకు నందు పొదుపు చూసుకోవాలని, ప్రమాద జీవిత బీమా 436 రూపాయలు చెల్లించి ప్రతిఒక్కరు బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఎవ్వరేనా ఫొన్ చేసినప్పుడు కొత్తవారికి మన ఓటిపి , ఏటిఎం సివి ఆర్ నెంబరు ఎవరికి తెలపరాదని, సైబర్ మోసాల మీద అవగహన కల్పించారు. ఈ కార్యక్రమశీలో వెలుగు సీసీలు నరసింహులు,మస్తాన్, యానిమేటర్లు అనంద్ నాయక్, ఉత్తమ్ రెడ్డి,మహిళ సంఘ సభ్యులు , రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img