Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నీటి ట్యాంకులు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

విశాలాంధ్ర- ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో 10 వ వార్డు, ఇందిరానగర్ లో మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 15 ఆర్థిక సంఘం నుంచి రూ.4 లక్షల నిధుల వ్యయంతో ఏర్పాటు చేసిన బొర్వెల్ సిస్టమ్ వాటర్ ట్యాంకులను మంగళవారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోట్లది రూపాయలతో అనేక పనులు చేపట్టామని ఆయన తెలిపారు. వీటిలో 2.80 కోట్లతో జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి ఉచిత కుళాయిలు ఇస్తున్నామన్నారు. పంచాయితీ నిధులతో ఆయా వార్డుల్లో ఇప్పటి వరకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసి 80 బొర్వెల్ సిస్టం వాటర్ ట్యాంకులు ఏర్పాటు పూర్తి చేశామని చెప్పారు.ముఖ్యంగా త్రాగునీటి సమస్య పూర్తి స్థాయిలో తీర్చేందుకు ఉదిరిపికొండ నుంచి పైపులైన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ పనులు పూర్తి అయితే పట్టణంలో త్రాగునీటి సమస్యే ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img