Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నూతన న్యాయవాదుల కమిటీ ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కోర్టులో శుక్రవారం బార్ అసోసియేషన్ గదిలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు కలిసి నూతన న్యాయవాదుల కమిటీని (బార్ అసోసియేషన్) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా ఎంపీ. సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా ఎస్. కృష్ణమూర్తి, జనరల్ కార్యదర్శిగా విజయ రాఘవేంద్ర, సహకార దర్శినీగా వీజీ.బాలసుందరి, లైబ్రరీ ఇన్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి కోశాధికారిగా బిళ్లే రవి ఎంపికయ్యారు. ఈ నూతన కమిటీ ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుందని బార్ అసోసియేషన్ వారు తెలిపారు. అనంతరం సీనియర్, జూనియర్ న్యాయవాదులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూ, అందరికీ న్యాయాన్ని చేకూర్చుతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img