Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

హోం మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ లో ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో ఉందని నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటీ వనితను శనివారం విజయవాడలో సచివాలయంలో ఎమ్మెల్సీ వై. శివరాం రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ మరియు టౌన్ సర్కిళ్లను ఏర్పాటు చేస్తూ ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లను కేటాయించారని, అయినప్పటికీ రూరల్ మరియు అర్బన్ పోలీస్ స్టేషన్లు రెండు పాతబడిన ఒకే పోలీస్ స్టేషన్ భవనం నందు నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా ఉందని, కాబట్టి వెంటనే ప్రభుత్వం ఉరవకొండ పట్టణం నందు అర్బన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను విడిగా ఏర్పాటు చేస్తూ వాటికి కొత్త భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అందుకు కావలసిన నిధులను వెంటనే మంజూరు చేసి నూతన పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రికీ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.దీనికి స్పందించిన హోం మంత్రి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని నూతన పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించడానికి తగిన నిధులను విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చినట్లు ఎమ్మెల్సీ విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img