ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర-ఉరవకొండ : నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి ఆనందంగా ఉండాలని వారికి ఆర్థికంగా కలిసి రావాలని కోరుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బడుగు బలహీన, పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారని ఈ నూతన సంవత్సరం కూడా సంక్షేమ ఫలాలు అందరికీ చేరి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని ఆయన కోరుతూ ప్రతి ఒక్కరికి 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.