Friday, April 19, 2024
Friday, April 19, 2024

నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరము

విశాలాంధ్ర :శెట్టూరు సమాజాభివృద్ధికి విజ్ఞాన పునాదులు పిల్లలలో సృజనను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని తహసిల్దార్ ఫణి కుమార్ పేర్కొన్నారు
సోమవారం మండలకేంద్రంలో గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఏర్పాటు చేసిన సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి సెలవులు విద్యార్థులు వృధా కాకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలు ద్వారా విద్యార్థులు ఉపయోగపడే విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తుందన్నారు గ్రంథాలయాల్లో ఈ నెల 8 నుంచి జూన్ 11వ తేదీ వరకు చిన్నారులకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది పిల్లలు వేసవి సెలవులను సక్రమంగా వినియోగించుకునేలా చదివే అలవాటు పెంపొందేలా గ్రంథాలయాలకు వచ్చేటట్లు అలవాటు చేయడం ఆసక్తి కలిగిన పాఠ్యంతర అంశాల్లో శిక్షణ పొందేలా ప్రణాళిక సిద్ధం చేశారు
ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు శిబిరం జరుగుతుంది ప్రణాళిక ప్రకారం కథలు వినడం గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం చదివిన పుస్తకాలపై సమీక్షలు ఇవ్వడం కథలు చెప్పడం స్పోకెన్ ఇంగ్లీష్ చిత్రలేఖనం వంటి అంశాలు నేర్పిస్తారు శిబిరం ముగింపు కార్యక్రమంలో పిల్లలకు బహుమతులు ఇస్తారు.వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్, ఐకెపి అధికారి సద్దానప్ప, గ్రంధాలయాధికారి రజిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img