Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నేడు వెంకటేశ్వర ఆలయంలో కోయిల్‌ ఆల్వార్‌ తిరుమల సేవ…

విశాలాంధ్ర-గుంతకల్లు : ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్‌ ఆల్వార్‌ తిరుమంజన సేవా కార్యక్రమం జరుగునని భక్త మండలి కమిటీ సభ్యులు రమేష్‌ రెడ్డి తెలిపారు.సోమవారం పట్టణంలోని రాజేంద్రనగర్‌ కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ…ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని నేడు మంగళవారం ఉదయం 7.30 నిమిషాలకు గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్‌ లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోయిల్‌ ఆల్వార్‌ తిరుమంజన సేవ(కర్పూరము తో ఆలయ శుద్ధి చేయునని తెలిపారు.22.3.23 బుధవారం ఉదయం శ్రీవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మాత్రాన్న సేవ జరుగునని తెలిపారు.ఉగాది పండుగ రోజు మాత్రమే నిర్వహించే శ్రీవారికి బియ్యం కొలిచి సమర్పించే సేవ,(ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు)సాయంత్రం ఐదు గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.. కావున భక్తాదులందరూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీవారి కృపను పొంద ప్రార్థన కావాలని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీ వెంకటేశ్వర భక్తి మండలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img