Friday, April 19, 2024
Friday, April 19, 2024

పదవ తరగతి పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీలో నందు గురువారం 10వ తరగతి పరీక్షల కేంద్రాలను నూతనంగా సత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, బాధ్యతలు చేపట్టిన అనంతరం పెనుకొండ నందు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మొదటగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల , శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఏ సెంటర్, మరియు బి సెంటర్ లను, తనిఖీ నిర్వహించి పిల్లల హాజరులను పిల్లలు సైన్స్ లో రాస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుని ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహించాలని ఆయన తెలిపారు కలెక్టర్ తో పాటుగా సబ్ కలెక్టర్ కార్తిక్, తాసిల్దార్ సువర్ణ, డివైఇవో రంగస్వామి, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ .తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img