Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పదవ తరగతి మాదిరి ప్రశ్న పత్రాల బుక్స్‌ పంపిణీ… యుటిఎఫ్‌ నాయకులు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని మోటుమెళ్ళ గ్రామము వద్ద గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న బాలికలకు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన పదవ తరగతి మోడల్‌ టెస్ట్‌ పేపర్స్‌ పుస్తకాలను ఎంఈఓ. సుధాకర్‌ నాయక్‌, రూరల్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయ చంద్రారెడ్డి చేతులమీదుగా అందజేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఈ పుస్తకాలను చక్కగా ఉపయోగించుకొని పరీక్షలందు ఉత్తమ ప్రతిభను ఘనపరచాలని తెలిపారు. ఎస్సై ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని, ఇందుకు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ పుస్తకాల కు దాతగా ఓబులాయనిపల్లికి చెందిన గంగాధర్‌ నాయుడు ఉచితంగా అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఆదిరెడ్డి, జనార్దన్‌, నారాయణస్వామి, పాఠశాల ఎస్‌ఓ. చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img