విశాలాంధ్ర -ఉరవకొండ : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు.సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పట్టు వస్ర్తాలతో అలంకరించి పల్లకీలో మేళతాళాల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు