Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పాదయాత్రలో పాల్గొన్న మహిళ నేత

బాలకృష్ణ కు మర్యాదపూర్వకంగా సన్మానం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గానికి చెందిన మహిళా నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువ గళం పాదయాత్ర సింగనమల నియోజకవర్గం లో జరుగుతుండగా సవిత ఆధ్వర్యంలో పాదయాత్రలో పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా కప్పి సన్మానించారు బాలకృష్ణ సవిత తో మాట్లాడుతూ యువ గళం పాదయాత్ర విజయవంతం చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు ముఖ్యంగా మహిళలలో చైతన్యం తీసుకురావాలని బాలకృష్ణ తెలిపారని సవిత తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, త్రివేంద్ర, వెంకటేశులు, ప్రసాద్, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img