Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పామిడిలో ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని గెలిపించండి.. సిపిఐ ప్రచారం

విశాలాంధ్ర-గుంతకల్లు : పామిడి మండలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం టంగుటూరు చిన్నప్ప శెట్టి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులను సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి,ఏఐటియుసి మండల అధ్యక్షుడు నాగరాజు లు కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహ రెడ్డి ని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు ఇరువురికి మొదటి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్, రైతు సంఘం నాయకులు ఉమ్మర్ భాష,ఏఐఎస్ ఎఫ్ మాజీ జూనియర్ కళాశాల చైర్మన్ రాహిమ్,ఏఐటియుసి నాయకులు గఫుర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img