Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

పాలిటెక్నిక్ విద్యార్థులదే భవిష్యత్తు

ట్రాన్స్ కో ఈ ఈ ఏవి గిరిధర్

విశాలాంధ్ర -ఉరవకొండ : పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రతి విద్యార్థి కూడా కష్టపడి, ఇష్టపడి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ట్రాన్స్కో ఈ ఈ ఏవి గిరిధర్ అన్నారు. ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు మంగళవారం కళాశాలలో ప్రిన్సిపల్ అస్రాఫ్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అనువైన అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయని వీటన్నింటినీ కూడా విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రాన్స్కో డిఈఈ జిలాన్ భాషా, ప్రిన్సిపాల్ ఆశ్రఫ్ఆలీ, త్రిబుల్ ఈ శాఖాధిపతి సురేష్ బాబు మాట్లాడుతూ ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పడినప్పుడు నుంచి అనేక విజయాలను సాధించింది అన్నారు. ఎంతోమంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత లక్షలను చేరుకున్నారని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు తమ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ శాఖ అధ్యాపకులు సులోచన, ఆలీ అసన్ హుస్సేన్, తదితరులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను కళాశాల సిబ్బంది సన్మానించారు. అనంతరం కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నాగరాణి, జెడి పద్మారావుకు కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img