Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని  ప్రచారం

విశాలాంధ్ర-ఉరవకొండ : పిడిఎఫ్ తరపున  పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిలు గా పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నందున మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతూ సోమవారం వజ్రకరూర్ మండలంలో వజ్రకరూరు కొనకొండ్ల, చాబాల ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులనూ మరియు పట్టభద్రులను కలిసి  ప్రజా సంఘాల నాయకులు ప్రచారం చేపట్టారు. శాసన మండలి లో  హక్కుల కోసం పోరాడే వ్యక్తులను ప్రజావాణిని వినిపించే వ్యక్తులను గెలిపించాలని  పిడిఎఫ్ ఎమ్మెల్సీల తోనే   సమస్యలు పరిష్కారం అవుతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, రైతు సంఘం నాయకులు సుల్తాన్ తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img