విశాలాంధ్ర – గణపవరం : గణపవరం మండలం పిప్పర శాఖా గ్రంధాలయనికి విద్యార్థులు చదువరుల అవసరార్ధం కంప్యూటర్ ఏర్పాటు చెయ్యాలని కోరినట్లు గ్రంధాలయాభివృద్ధి కమిటి సభ్యులు ఇందుకూరి వెంకట నరసింహారాజు (ఐ వి రాజు), గుడ్ల వెంకట కృష్ణారావు, గ్రంధాలయాధికారి పి రంగరావు, భారతీయ స్టేట్ బ్యాంక్ పిప్పర శాఖ మేనేజర్ యన్ వెంకటేశ్వరరావుని సంప్రదించినట్లు తెలిపారు. గురువారం బ్యాంకు సిబ్బందితో కలసి బ్యాంకు మేనేజర్ కంప్యూటర్ ని శాఖా గ్రంధాలయనికి బహుకరించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ కి, వారి సిబ్బందికి గ్రంధాలయభివృద్ధి కమిటీకి తరుపున గ్రంధాలయధికారి పి రంగారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ,పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.