విశాలాంధ్ర –ధర్మవరం : ముక్కోటి ఏకాదశి వేడుకలు ముగిసిన తర్వాత మంగళవారం ఉదయం బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉదయం శ్రీవారి గరుడోత్సవాన్ని చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య, భక్తులు, సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత అర్చకులు కోనేరా చార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్లు గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను అమర్చి, వివిధ పూలమాలలతో చక్కగా అలంకరించిన పిదప, వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీవారి గరుడోత్సవమునకు ఉభయ దాతలుగా కీర్తిశేషులు మోకా చిన్న వెంకటసుబ్బయ్య మనవడు ఎం. రాఘవేంద్ర రవితేజ- హైదరాబాద్ వారు వ్యవహరించారు. అనంతరం స్వామి వారిని పట్టణ పురవీధులలో సాంప్రదాయ పద్ధతిలో ఊరేగించారు. వందలాదిమంది భక్తాదులు తమ తమ వీధుల యందు స్వామివారిని దర్శించుకునీ, పూజలు చేశారు.