Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పేదలకు వైద్య సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది.. వాసవి క్లబ్ ఆసుపత్రి చైర్మన్ కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు

విశాలాంధ్ర – ధర్మవరం : పేదలకు వైద్య సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉందని వాసవి క్లబ్ ఆసుపత్రి చైర్మన్ కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల వాసవి క్లబ్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరమును చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్మవ్యాధి వైద్య నిపుణులు పానెం నజీర్, జనరల్ డాక్టర్ సంజీవిని లు రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించారు. అనంతరం కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2005 వ సంవత్సరంలో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని, అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు లక్ష మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. మున్ముందు వివిధ రకాల వైద్య నిపుణులతో కూడా శిబిరాలను అతి త్వరలో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ శిబిరంలో 75 మందికి వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. అనంతరం డాక్టర్ నజీర్ను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, మనోహర్, వాసవి క్లబ్ ఆసుపత్రి కమిటీ సభ్యులు జయంతి నాగానంద, అంబటి బద్రీనాథ్, కలవల రాధాకృష్ణ, పిన్ను ప్రసాద్, దేవతా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img