Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేదవాడి కడుపు నింపడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం… టిడిపి శ్రేణులు

విశాలాంధ్ర -ధర్మవరం : పేదవాడి కడుపు నింపడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని టిడిపి శ్రేణులు పురుషోత్తం గౌడ్, భీమనేని ప్రసాద్ నాయుడు, పరిసేసుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం 37వ రోజు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన గల అన్నా క్యాంటీన్లో వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు పెరగడం తో కనీసం ఒక పూట కడుపునిండా భోజనం చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకోవడం దారుణం అన్నారు. అన్నా క్యాంటీన్లు మూతతో పేదవాడి కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వం చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ.. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై ఎందుకు లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ఈ ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టడం మాకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ ప్రభుత్వానికి తొందర్లోనే ప్రజలు తిరస్కరించే రోజు ఆసన్నమైనదని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టిడిపికి మద్దతు పలుకుతున్నారని అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. నేడు అన్న క్యాంటీన్ నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన శ్రీశైలం గురు స్వామి గౌడ్, శ్రీశైలం గౌడ్, శ్రీశైలం విశాల్ గౌడ్ లను తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మారుతి స్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, అంబటి సనత్, గరుగు రంగమ్మ, బోయ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img