విశాలాంధ్ర- అనంతపురం : పేద విద్యార్థుల కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతకు తోడ్పాటును అందించడమే తమ లక్ష్యసాధనని కనకదాసు ఫౌండేషన్ ఇస్తుందని ఫౌండేషన్ చైర్మన్ ఎండి నాగభూషణం పేర్కొన్నారు. ఈనెల 20న అనంతపురం పట్టణంలోని గీతా మందిర్ లో కనకదాసు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా సిద్ధ రామ నంద పూరి స్వామీజీ, ముఖ్య అతిథులుగా ఐ ఆర్ ఎస్ బి.యాదగిరి , ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు మేధావులు , సామాజిక సేవ కార్యకర్తలు, అభిమానులు రానున్నారు.