Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది

విశాలాంధ్ర ` కళ్యాణదుర్గం టౌన్‌ : ఆంధ్రుల ఆశయ సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జయం విశ్వనాథ్‌ పేర్కొన్నారు. గురువారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరాములు ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు ఆంధ్రుల ఆశయ సాధన కోసం త్యాగానికి ఆంధ్ర ప్రాంతంలో అమరజీవి గా గౌరవించబడ్డారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక రాష్ట్రంగా ఉండటానికి 56 రోజులు నిరాహార దీక్ష చేసిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img