Friday, April 19, 2024
Friday, April 19, 2024

పౌష్టికాహారతో రక్తహీనతకు దూరం కావచ్చు

విశాలాంధ్ర -శెట్టూరు : పౌష్టికాహారంతోనే రక్తహీనతకు పెట్టవచ్చని తహసిల్దార్ ఫణికుమార్ పేర్కొన్నారు.
మంగళవారం మండల కేంద్రంలో గ్రామ సచివాలయం తనిఖీ చేపట్టారు రికార్డు పరిశీలించి గ్రామ సచివాల పరిధిలో 519 కిషోరబాలికలుగాను 466 మందికి రక్తహీనత ఉన్నట్లు ఆన్లైన్లో చూపడంతో వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిందన్నారు వాస్తవానికి ఒక్కరు మాత్రమేఅనీమియాతో ఒకరు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు డాక్టర్ వేణు కార్తికేయ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీధర్ ఇంచార్జ్ ఎంపీడీవో గంగావతి, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సుమతి పంచాయతీ కార్యదర్శి వ్యాసరావు, మల్లికార్జున, డిజిటల్ అసిస్టెంట్ నాగరాజ్, విఆర్ఓ తిప్పేస్వామి, మహిళా పోలీస్ బేబీ
తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img