Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజల కోసమే ప్రతిరోజు భోజన సౌకర్యం..

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రజల కోసమే ధర్మవరం పట్టణంలో ప్రతిరోజు భోజన సౌకర్యమును కల్పిస్తున్నట్లు బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎర్రగుంటలోని తన వ్యక్తిగత కార్యాలయం వద్ద భోజన సౌకర్య ఏర్పాటును వారు ప్రారంభించారు. అనంతరం గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ధర్మవరంలో దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కువ అయ్యాయని, వాటిని అడ్డుకొని ప్రతి కార్యకర్తకు, ప్రజలకు న్యాయం చేస్తానని తెలిపారు. తొలుత పూజలు నిర్వహించిన అనంతరం, కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు వారి చేతలు మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనాతో దేశమంతా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి కావడం జరిగిందని, తాను ప్రజలకు అండగా ఉంటూ న్యాయం చేస్తానని తెలిపారు. వివిధ పనుల నిమిత్తం ధర్మవరానికి వచ్చే, ప్రజలకు తన కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భోజన సౌకర్యాన్ని కల్పించడం నాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేకులు కట్ చేయగా, నాయకులు, కార్యకర్తలు భారీ మాల తో గోనుగుంట్ల సూర్యనారాయణ సత్కరించారు. తదుపరి పట్టణంలోని దుర్గా నగర్ లో నూతనంగా వెలిసిన శీతల దేవి రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చిన్న కృష్ణ ,బెస్త రామకృష్ణ మాజీ ఎమ్మెల్యేను ఘనంగా శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుదర్శన్ రెడ్డి, చిగిచెర్ల అరవింద్ రెడ్డి, రాప్తాటి రాము, దుస్సా కృష్ణ, అంబటి బద్రి, సూర్యనారాయణ రెడ్డి, బోడగల గిరిధర్ ,గొట్లూరు చంద్ర, కొండ సీన, వీరన్న, బోయలపల్లి సుజాత, గంధమనేని నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img