Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనసేన పార్టీ పనిచేస్తుంది…

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనసేన పార్టీ పనిచేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని తోపాటు వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే సహించేది లేదని.. ఖబర్దార్.. అని హెచ్చరించారు. ఓ జగన్ రెడ్డి.. మీ బాబాయిని చంపిన హంతకులు మీ ఇంట్లోనే ఉన్నారు!! చంపలేదని నీవు అసెంబ్లీలో ఎలా ప్రకటించావని? తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలిపారు. ప్రత్యేక హోదాపై మీ ఉద్యమాలు ఏమయ్యా అని? వారు ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలకు కచ్చితంగా సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా నేటి వైఎస్సార్సీపీ నాయకులు తయారు కావడం సిగ్గు చేటు అన్నారు. పవన్ కళ్యాణ్ పై లేనిపోని బురద జల్లుతూ, అవాక్కులు, చవాకులు మాట్లాడడం ఇకనైనా వైఎస్ఆర్సిపి నాయకులు మానుకోవాలని హితువు పలికారు. ప్రతి విషయాన్ని రాజకీయాలు చేయడం పద్ధతి కాదని హెచ్చరించారు. వివేకానంద రెడ్డి యొక్క కేసును ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పరిష్కరించడం ఎందుకు లేదని వారు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పవన్ కళ్యాణ్ పై తిరిగి బురద చల్లడం అలవాటైందని వారు మండిపడ్డారు. నేటి వైఎస్ఆర్సిపి పాలనలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తిరిగి అధికారం చేపట్టడం కల అని తెలిపారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం మాట్లాడడం పద్ధతి కాదని, చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు క్షమాపణ చెబుతూ, వాస్తవాలు తెలపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు, మంత్రులుకోట్ల ఆస్తులు సంపాదించడమే కాక, దౌర్జన్యం, అక్రమార్జన, బెదిరింపులు చేయడం నిజం కాదా? అని వారు ప్రశ్నించారు. ఓవైపు తల్లి నీ, చెల్లిని ఇంటి నుండి బయటికి పంపిన తర్వాత, ఏదో సాధించారని ఏపీ అంతట.. ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికించడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. ప్రజలు మీ పరిపాలన అంతా గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెబుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img