Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఎంపీ తలారి రంగయ్య

విశాలాంధ్ర – ఉరవకొండ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో బుధవారం ఃగడప గడపకు మన ప్రభుత్వంః కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి ఎంపీ విలేకరులతో మాట్లాడుత ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img