Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజా సమస్యల నిర్వీర్యం చేసిన వైసిపి ప్రభుత్వం

విశాలాంధ్ర-శెట్టూరు : ప్రజా సమస్యల పరిష్కరించడంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విప్లమైందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు టిఆర్‌ తిప్పేస్వామి, ప్రధాన కార్యదర్శి ఆదిశేష పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాటకల్లు గ్రామాల్లో ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ మాట్లాడుతూ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ గ్రామం కూడా అభివృద్ధి లేకుండా దోచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదు అన్నారు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం వీటన్నిటిని దృష్టిలో తెలుగుదేశం గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో రామరాజు, మాజీ సర్పంచ్‌ ఆంజనేయులు, మారుతి కుమార్‌, సత్యప్ప, రామచంద్ర, రంగప్ప, ఇమ్రాన్‌ ఖాన్‌, అనిమేష్‌, ఆంజనేయులు, తంజిల్‌, గిరి, లక్ష్మీనారాయణ, నరసింహులు, నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img