Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతిభ కనపరిచిన ప్రభుత్వమోడల్ జూనియర్ కళాశాల

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలలో ప్రతిభను చాటడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో శుక్రవారం వారు మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో 47 మందికి 20 మంది ఉత్తీర్ణత కాగా 42.5 శాతము, అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 64 మందికి 38 మంది ఉత్తీర్ణత కాగా 59.4 శాతము నమోదు కావడం జరిగిందని వారు తెలిపారు. ప్రధమ ఇంటర్ సంవత్సరములో ఎంపీసీ గ్రూపులో ఏ. శ్రీవిద్య 406 మార్కులు, సీఈసీ గ్రూపులో ఎం. లక్ష్మీనరసింహ వరప్రసాద్ 394, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బైపిసి గ్రూపులో సాకే పావని 948 మార్కులు, ఎంపీసీ గ్రూపులో ఉప్పర అనూష 900 మార్కులతో కళాశాల ప్రథమ స్థానంలో రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img