Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళితే విజయం తథ్యం..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి విద్యార్థి లక్ష్యముతో ముందుకు వెళితే విజయం తథ్యం అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసినఁ ఉద్యోగ విజయోత్సవం సభకుఁ ముఖ్యఅతిథిగా వారు విచ్చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బాలజ్యోతి తో పాటు అధ్యాపకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నేడు ప్రభుత్వ కళాశాలలను మరింత మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, విద్యకు సంబంధించిన ప్రతి పథకాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రైవేట్,కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ కళాశాలలు రాష్ట్రములో ముందంజలో ఉన్నాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతోనే అనేక పథకాలను ముఖ్యమంత్రి విద్యార్థులకు అందజేయడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. అనంతరం ఇటీవల మార్చి 29వ తేదీన ఉద్యోగమేల కార్యక్రమము నిర్వహించిన వాటిలో ప్రతిభ కనబరిచిన 35 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలను వారు అందజేశారు. ప్రతి విద్యార్థి తాను చదివిన విద్యకు తగ్గ ఉద్యోగము కృషి చేస్తేనే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలస్వామి, టిపిఓ జెసింత్ రాజా, అధ్యాపకులు బాల జోషి, కళ్యాణి, బోధనేతర బృందం, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img