రథోత్సవానికి పోటెత్తిన జనం
చెన్నకేశవున్ని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే సూరి, టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 27 నుండి అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా ఏడవ రోజు (మడుగు తేరు) రథోత్సవ కార్యక్రమం వందలాదిమంది భక్తుల నడుమ, ఉభయ దాతలు, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దంపతులు, పట్టణ ప్రముఖుల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. తొలుత శ్రీదేవి, భూదేవి చెన్నకేశవ ఉత్సవ విగ్రహాలను ఆలయము నుండి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవిందా.. గోవిందా.. అన్న నామస్మరణతో తేరు బజార్ వరకు గజ వాహనము ద్వారా ఊరేగింపుగా అక్కడికి చేరుకున్న రు. వేద పండితులు ఆలయ అర్చకులు యొక్క వేద మంత్రాలను వల్లిస్తూ స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వారి భార్య సుప్రియ దంపతులకు ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం,ఈవో వెంకటేశులు, ఎమ్మెల్యే దంపతులు, పట్టణ ఉభయ దాతలు, పేరిటన అర్చనలు, పూజలు నిర్వహించారు. పూజలకు ముందు అన్నమయ్య సేవా మండలి వారు, వారి శిష్య బృందం 50 మంది కళాకారులు పింగాణి మేల్లం, పంచమా వాయిద్యం, బృందం నాట్యంతో నిర్వహించిన వైనం (కేరళ మాదిరిగా) భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. రథోత్సవాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి దంపతులు లాగి ప్రారంభించారు. అనంతరం వందలాదిమంది గోవింద నామ స్మరణతో రథమును లాగి పునీతులయ్యారు. కరోనా అనంతరం నిర్వహించిన ఈ రథోత్సవం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది భక్తాదులు రథోత్సవం వద్ద పూజలు నిర్వహించి, ప్రసాదాలను అందుకున్నరు. పోలీసు బలగాలు కూడా డి.ఎస్.పి హుస్సేన్ పీరా, పట్టణ వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎస్ఐలు మహమ్మద్ రఫీ అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొని, పూర్తి బందోబస్తు నిర్వహించి, విజయవంతమనకు ఎంతో కృషి చేశా రు.
రథోత్సవములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్:: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవములో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తో పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తాదులను, ప్రజలను ఆప్యాయంగా పలకరించి ప్రసాదాలను స్వీకరించారు. వీరి ఇరువురికి ఆలయ కమిటీ వారు పట్టు వస్త్రాలు సమర్పించారు.