Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం

విశాలాంధ్ర- శెట్టూరు : ప్రపంచంలోనే అత్యున్నతమైన మన రాజ్యాంగం అని తహసిల్దార్ ఫణి కుమార్ పేర్కొన్నారు గురువారం మండల వ్యాప్తంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్యాలయము సంఘం బడి,ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు,ఎంపీడీఓ,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కస్తూర్బా గాంధీ పాఠశాలలో కార్యాలయాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ దేశ పౌరులు హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందించుకుంటూ మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమార్ ఎంపీడీవో గంగావతి, ఎంఈఓ శ్రీధర్, డాక్టర్ వేణు కార్తికేయ, మహేశ్వర్ రెడ్డి, భాస్కర్, వెంకటేష్ అశోక్ కుమార్ ఎమ్మెస్ రాయుడు, బోయ తిప్పేస్వామి, వీఆర్వోలు, పోలీస్ సిబ్బంది గ్రామ సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img