విశాలాంధ్ర`ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో యువర్ ఫౌండేషన్ సహకారంతో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు కంటి పరీక్షలను గురువారం నిర్వహించడం జరిగిందని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు వైకే శ్రీనివాసులు, కార్యదర్శి సుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వైద్యాధికారి ఉరుకుందప్ప 35 మంది వృద్ధులకు కంటి పరీక్షలను నిర్వహించి 18 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. కంటి ఆపరేషన్లను సంచారనేత్ర వైద్యశాల అనంతపురం నందు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ బి వి సుబ్బారావు, రమేష్ బాబు, శ్రీధర్, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.