Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవంలో జన్మించిన బాల భీముడు

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5.8 కేజీల బరువు గల శిశువుకు జన్మనిచ్చింది ఒక తల్లి చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన తేజస్విని భర్త నాగిరెడ్డి మూడవ సంతానంగా జన్మించినట్లు తెలిపారు. డాక్టర్ సుజాత గైనకాలజిస్ట్ మరియు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సాధారణ ప్రసవం జరిగినట్లు ఇలాంటి ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టడం అరుదుగా ఉంటారని ప్రసవంతో ఉన్నప్పుడు తల్లి తేనే పోషిక ఆహారాన్ని బట్టి పిల్లలు పౌష్టికంగా జన్మిస్తారని డాక్టర్ సుజాత తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. సాధారణ ప్రసవం చేయడానికి డాక్టర్లు బాగానే కృషి చేశారని డాక్టర్ సుజాతను అభినందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img