Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రమాదానికి గురైన కార్మికున్ని పరామర్శ

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని యల్లనూరు రోడ్డు సమీపంలో ఉన్న శివానగర్ కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు మేస్త్రి చంద్ర గత రెండు వారాలు కిందట బాల్కాని పనిచేస్తూ ప్రమాద వశాత్తు సారవ కట్టెలు విరిగి తీవ్రంగా కాలు విరగి గాయపడటం జరిగినది. దీంతో సమాచారం తెలుసుకున్న భవన నిర్మాణ కార్మిక జిల్లా అధ్యక్షుడు, బిజెపి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు బుధవారము మేస్త్రి చంద్ర ఇంటి దగ్గరకు వెళ్లి పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పనులు చేసే చోట సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా, పోస్టల్ భీమా తప్పక చేయించు కోవాలని తెలియచేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ సూరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img