Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రయాణీకుల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రం : ఎస్ఐ ఆంజనేయులు

విశాలాంధ్ర-రాప్తాడు : తీవ్ర రూపం దాల్చిన వేసవిలో ప్రయాణీకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎస్ఐ ఆంజనేయులు అన్నారు. హంపాపురం గ్రామ యువత హెల్పింగ్ హాండ్స్ ఆద్వర్యంలో హంపాపురం సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన గురువారం ఎస్ఐ చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభింపజేశారు. ఎండాకాలంలో దాహం ఎక్కువగా ఉంటుందనే ప్రజల దాహర్తిని తీర్చడానికి మంచి కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో హంపాపురం జయప్ప, సంతోష్, జయప్రకాష్, సాయికుమార్ రెడ్డి, ఎర్రిస్వామి, సోముశేఖర్ రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img