విశాలాంధ్ర-కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని కోర్టులో ఫిబ్రవరి 11న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా పెండిరగ్ లో ఉన్న వివిధ కేసుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో వీలైనన్ని కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు.