విశాలాంధ్ర ` బొమ్మనహళ్ : వైయస్సార్ ఫ్యామిలీ ఫిజీషియన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మల్లేశ్వరి పేర్కొన్నారు శనివారం .ఫ్యామిలీ ఫీజీసియన్ ప్రోగ్రాం లో భాగంగా ఉంతకల్లు గ్రామంలో వైద్యాధికారి మల్లేశ్వరి బిపి,సుగర్,గర్భవతులు,బాలింతలు, గుండే సమస్యలు ,పక్షవాతం పేషంట్స్ లకు రక్త పరీక్షలు చేసి వైద్యం చేయడం జరిగింది. అలాగే మంచానికి పరిమితమయిన పక్షవాతం రోగులకు ఇంటి వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్యం అందించడం జరిగింది. ప్రజలకు వ్యక్తి గత పరిశుభ్రత పాటించమని,పోస్తికాహరం తినమని, శారీరక శ్రమ చేయమని,సమయానుకూలంగా మందులు వాడాలని,ఆరోగ్య సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి అఖిల ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్ ఆశ వర్కర్లు పాల్గొన్నారు.