Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఫ్రెండ్లీ పోలీసింగ్ తో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : ఎస్ఐ పీవై ఆంజనేయులు

విశాలాంధ్ర-రాప్తాడు : మండల ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎస్ఐ పీవై ఆంజనేయులు అన్నారు.  రాప్తాడు ఎస్ఐగా పనిచేస్తున్న బి.రాఘవరెడ్డిని జిల్లా ఎస్పీ పక్కీరప్ప కాగినెల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ చేసి అక్కడ నుంచి నార్పల పోలీసు స్టేషనుకు అటాచ్ చేశారు. అదేవిధంగా బుధవారం రాప్తాడు ఎస్ఐగా ఆంజనేయులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన విషయాలైనా తన దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు చేపడతానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు చోరీల నివారణకు తగు చర్యలు తీసుకుంటానన్నారు.
యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సుంచించారు. అలాగే ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికైనా నేరుగా పోలీస్టేషన్ కి వచ్చి పిర్యాదు చేయాలని కోరారు. పార్టీలకతీతంగా విధులు నిర్వర్తిస్తూ మెరుగైన సేవలందిస్తానన్నారు. అనంతరం ఎస్ఐకు ఏఎస్ఐలు శ్రీరాంనాయక్, గోవిందు, సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img