కార్యదర్శికి విజ్ఞప్తి చేసిన వీరశైవ సంఘం
విశాలాంధ్ర -ఉరవకొండ : ప్రముఖ సంఘ సంస్కర్త, సమసమాజ నిర్మాణ ప్రదాత శ్రీ బసవేశ్వరుని విగ్రహం ఉరవకొండ పట్టణంలో ఏర్పాటు చేయాలని తాలూకా వీరశైవ సంఘం తీర్మానించుకోవడం జరిగిందని ఇందుకు సంబంధించి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో స్థలం కేటాయించాలని ఉరవకొండ. మేజర్ పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ ను తాలూకా వీరశైవ సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం తాలూకా అధ్యక్షుడు బుక్కీట్ల అశోక్ , ప్రధాన కార్యదర్శి పాల్తూరు శంకర్, సెక్రెటరీ వీరప్ప, డైరెక్టర్లు రాజన్న, రుద్రప్ప, నటరాజ, నిరంజన్ గౌడ్ సోమవారం కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ ఆరాధ్య దైవమైన శ్రీ బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటుకు పాలకవర్గం గ్రామ కార్యదర్శి స్థలం కేటాయించి సహకరించాలని కోరారు.