విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు ఈనెల 20వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్, బాలికల హాకీ జట్టు ఎంపికలను నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు బంధనాథం సూర్యప్రకాష్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సబ్ జూనియర్ విభాగంలో 1-1-2006 తర్వాత జన్మించిన వారు అర్హులని, జూనియర్ విభాగంలో 1-1-2003 తరువాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారినీలు ఎంపికలకు హాజరు కావాలని తెలిపారు. తమ వెంట ఆధార్ కార్డు, పదవ తరగతి మార్చ్ కార్డ్ తీసుకొని రావాలని తెలిపారు. ఇక్కడ ఎంపికైన వారు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి లో ఈనెల 28వ తేదీ నుండి మూడు రోజులపాటు జరగబోవు 13వ రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.