విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో వెలిసిన పాక్ దామన్ హజ్రతా సయ్యదున్నిసా బీబీ జైనబ్బీ రహంతుల్ల అలైహా దర్గా షరీఫ్ నూతన గుంబజ్ ను శుక్రవారం ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. మహబూబ్ సుబహాని గ్యార్మి పండుగ మరియు గుంబజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కు దర్గా కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా కమిటీ ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమంలో కేశవ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.