విశాలాంధ్ర`ఉరవకొండ : ఈనెల 7వ తేదీన విజయవాడలోనే ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే బీసీ మహాసభకు సంబంధించిన పోస్టర్లను శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ ఓబులేసు మాట్లాడుతూ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత బీసీ కులాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారన్నారు. విజయవాడలో జరిగే జయహో బిసి మహాసభ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీసీ కులాలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య మాజీ ఎంపీపీ ఎర్రి స్వామి, గోవిందు, వైసిపి నాయకులు బసవరాజు వన్నప్ప బ్యాళ్ల ప్రసాద్, ఆంజనేయులు అంజి, భీమన్న తదితరులు పాల్గొన్నారు