విశాలాంధ్ర -ధర్మవరం : ఊరి కొయ్యలను ముద్దాడిన విప్లవ కెరటాలు భగత్ సింగ్ రాజ్గుల్ సుఖదేవులను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ వారి 92వ వర్ధంతిని ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో విప్లవ వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య మాట్లాడుతూ విప్లవం అనే భావనను సాహిత్యంలో అర్థం చేసుకోకూడదని ఈ పదానికి వేరు వేరు అర్థాలు ఉన్నాయని వారు తెలిపారు. విప్లవ వీరులు రాసే కలానికి భావ ద్రోకాలు గురించి తెలుసునని వారు తెలిపారు. బాంబులు, తుపాకులు విప్లవాన్ని సృష్టించవని విప్లవం అనే కత్తిని ఆలోచనతోనే పెట్టాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆశావాదిగా జీవితాన్ని కొనసాగించడం గొప్ప విషయమని వారు తెలిపారు. అంతరాలు, అసమానతలు లేని సమాజం, సంపదలో వాటా, సమగ్ర యువజన అభివృద్ధి, నూతన ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కళాశాల కమిటీ నాయకులు గణేష్, తరుణ్, వంశీ, కిషోర్, మురళి, ధర్మ తేజ, చైతన్య, విజయ్, రవి, కృష్ణ, కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.