Friday, April 19, 2024
Friday, April 19, 2024

భీమ్ రావు యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

విశాలాంధ్ర-రాప్తాడు : బీమ్ రావు యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాప్తాడులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల వారికి వర్తించేలా కృషి చేసిన మహనీయుడన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు ఉండాలని యోచించిన మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ జూటూరు శేఖర్, సాకే చంద్ర,మన్నల రవికుమార్, తలారి నాగరాజు, బీమ్ రావు యువజన సంఘం, నాయకులు సాకే బాల నాగేంద్ర, సాకే ఓబులేసు, సురేష్, రమేష్, కృష్ణమూర్తి, వరిమడుగు శంకర్, శీల్ల ఉజ్జినప్ప, ముత్యాలు, నరసింహులు, శేఖర్, రామాంజనేయులు, ముత్తు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img