Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భోగిమంటల్లో జీవో ప్రతులు దహనం

విశాలాంధ్ర,కళ్యాణదుర్గం : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన జీవో నెంబర్‌ 1 ప్రతులను సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ నాయకులు శనివారం భోగిమంటల్లో దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో స్థానిక టిడిపి కార్యాలయంలో జీఓ ప్రతులను దహనం చేయగా, కంబదూరులో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్‌ చౌదరి ఆధ్వర్యంలో ప్రతులు భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. చీకటి జీవద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలన్నీ చెల్లబాటు కావని హైకోర్టులో తేటతెర్లమైందని ఇకనైనా ముఖ్యమంత్రి ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ మల్లికార్జున , పాపం పల్లి రామాంజనేయులు, ఆర్జి శివశంకర్‌, డీకే రామాంజనేయులు, మారుతి చౌదరి, ఉదయ్‌ భాస్కర్‌ చౌదరి, కంబదూరు మండల కన్వీనర్‌ శివన్న, కళ్యాణదుర్గం మండల కన్వీనర్‌ గోళ్ళ వెంకటేసులు, అమిలి నేని లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img