Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంచి పరిపాలన దక్షత ఉన్న నేత చంద్రబాబు

విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టి, మెరుగైన పరిపాలన దక్షతతో  మాజీ సీఎం చంద్రబాబు నాయుడు  తెలుగువారి కీర్తిని  ప్రపంచ చరిత్ర పుటల్లో నిలిపారని, అటువంటి వారి పాలనకు ప్రజలు దూరమవడంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి కోల్పోయిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా గురువారం రాప్తాడు టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీడీపీ నిరంతరం కృషి చేస్తుందని, చంద్రబాబు మళ్ళీ సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ పంపు కొండప్ప, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గజ్జల నారాయణస్వామి, మరూరు గోపాల్, బోయ గోపాల్, సర్పంచులు ఉజ్జినప్ప, నరేష్, ఎంపీటీసీ రవి, గంగలకుంట కిష్ట, బుల్లెట్ వెంకటరాముడు, విశ్వనాథరెడ్డి, ఇంద్ర, పసుపుల బాబయ్య, రామనేపల్లి రాము, చిరంజీవి, మల్లికార్జున, ఎజ్జె ఉజ్జినేశ్వర్, గేట్ సత్తి, సాకే నరేంద్ర, సోషల్ మీడియా నరేష్, రాజేశ్, దండు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img