Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

విశాలాంధ్ర-తాడిపత్రి : గన్నేవారి పల్లి కాలనీలోని కడప రోడ్డు నందు ఉన్న వైసిపి సీనియర్ నాయకుడు కురవ రామ్ శేఖర్ కార్యాలయం ముందు మంగళవారం కురవ రామ్ శేఖర్ ఆర్థిక సహాయంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి కురువ వెంకట రమణమ్మ హాజరై మజ్జిగ చలివేంద్రమును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం కడప రోడ్డు నందు గ్రామాల నుండి ఎంతోమంది పాదాచార్యులు, వాహనదారులు ప్రయాణికులు వెళుతూ ఉంటారు. అలాంటిది అత్యంత రద్దీ గల కడప రోడ్డు నందు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. అనంతరం జడ్పిటిసి కురువ వెంకట రమణమ్మ చేతుల మీదుగా కొంతమందికి మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రంగనాథ రెడ్డి,ఉమ్మడి గురుప్రసాద్ రెడ్డి,నరసింహా రెడ్డి,చవ్వా రాజశేఖర్ రెడ్డి, పద్మనాభ రెడ్డి,శేఖర్ రెడ్డి, పేరం ప్రతాప్ రెడ్డి,తిమ్మేపల్లి నాగార్జున రెడ్డి, గడ్డం పరమేష్,ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ శివ రామయ్య,ట్రాక్టర్ శివ,రాజా రెడ్డి,వర ప్రసాద్,డిష్ రాజశేఖర్ రెడ్డి, సదానంద వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img